పరీక్షా పేపరు లీక్ అవడం కారణంగా తెలంగాణా లో AE(అసిస్టెంట్ ఇంజనీర్) పరీక్షను రద్దు చేయడం జరిగింది. TSPSC( తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ) తదుపరి పరీక్షా తేది మరియు సమయాన్ని త్వరలో ప్రకటిస్తామని TSPSC ప్రకటించింది.
కాగా ఈ ఘటన వెనుక ప్రవీణ్, రేణుక, రాజశేఖర్ ప్రధాన నిందితులుగా గుర్తించారు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ AE(అసిస్టెంట్ ఇంజనీర్) పరీక్ష పత్రాన్ని పెన్ డ్రైవ్ లో లోడ్ చేసి ప్రవీణ్ కు ఇవ్వగా , ప్రవీణ్ రేణుకకు దాన్ని 10 లక్షలకు అమ్మినట్లు కమిటి గుర్తించింది. రేణుక తమ్ముడు రాజేశ్వర్ కోసం రేణుక ఈ పని చేసినట్లు తెలిపింది. కాగా TTC చదివిన తన తమ్ముడు AE పరీక్షకు అర్హుడు కాడు అని తెలియగా అశోక్ నగర్ లో శిక్షణ తీసుకుంటున్న ఒక యువకుడికి పరీక్షా పత్రాన్ని 4 లక్షలకి బేరం పెట్టింది. ఆ యువకుడు అంత ఇచ్చుకోలేమని ఆమెకి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. యువకుడి ఫిర్యాదు అనంతరం పోలీసులు కేసు దర్యాప్తు చేతబట్టారు.
No comments:
Post a Comment